nvs reddy: ఇప్పట్లో హైద‌రాబాద్ మెట్రో రైల్ సాధ్యం కాద‌న్నారు.. చేసి చూపించాం!: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

  • సుసాధ్యం చేసి చూపించాం
  • నెల రోజుల్లోనే 32.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు
  • 23 మెట్రో స్టేషన్లలో పార్కింగ్ వసతులున్నాయి
  • వచ్చేనెల 15లోగా మెట్రో స్టేషన్ల వద్ద సుందరీకరణ పనులు పూర్తి

ఇప్పట్లో హైద‌రాబాద్ మెట్రో రైల్ సాధ్యం కాద‌న్నారని, కానీ తాము సుసాధ్యం చేసి చూపించామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... నెల రోజుల్లోనే 32.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారని, మరో నాలుగు రోజుల్లో మెట్రో సర్వీసుల  టైమ్ టేబుల్ విడుదల చేస్తామని చెప్పారు. 23 మెట్రో స్టేషన్లలో పార్కింగ్ వసతులున్నాయని, ప్రకాశ్ నగర్ మినహా మిగతా వాటికి టెండర్లు ఆహ్వానించామని తెలిపారు. వచ్చేనెల 15లోగా మెట్రో స్టేషన్ల వద్ద సుందరీకరణ పనులు పూర్తి అవుతాయని చెప్పారు. పేటీఎం ద్వారా కూడా స్మార్ట్ కార్డులు రీఛార్జి చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

More Telugu News