Kannada: యువతిపై కన్నడ హీరో అత్యాచారం... పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరారీ!

  • 'హోంబణ్ణ' చిత్ర హీరో సుబ్రహ్మణ్య
  • కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపిచ్చిన సుబ్రహ్మణ్య
  • పెళ్లికి నిలదీస్తే తప్పించుకు తిరిగాడన్న బాధితురాలు
  • పరారీలో ఉన్న సుబ్రహ్మణ్య కోసం గాలిస్తున్నామన్న పోలీసులు

'హోంబణ్ణ' చిత్ర హీరో సుబ్రహ్మణ్య, కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని 23 సంవత్సరాల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరు బసవగుడి మహిళా పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసు వివరాల్లోకి వెళితే, రాజాజీనగర్ కు చెందిన యువతికి, సుబ్రహ్మణ్యకు పాత పరిచయం ఉంది. వీరు ప్రేమలో పడగా, పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించారు.

అయితే, 'హోంబణ్ణ' సినిమా షూటింగ్ తరువాత పెళ్లి చేసుకుంటానని సుబ్రహ్మణ్య మాటిచ్చాడు. ఈలోగా తన సిస్టర్ ఇంట్లో పార్టీ ఉందని యువతికి చెప్పిన సుబ్రహ్మణ్య ఆమె రాగా, మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆపై అత్యాచారం చేశాడు. తనకేమయిందో తెలుసుకున్న తరువాత ఆమె పెళ్లికి ఒత్తిడి చేయగా, తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, సుబ్రహ్మణ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News