Kurnool: ప్రత్యర్థులంతా ఉపసంహరణ... కేఈ ప్రభాకర్ ఎన్నిక ఏకగ్రీవమే!

  • నామినేషన్ ను ఉపసంహరించుకున్న బైరెడ్డి అనుచరుడు 
  • స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్న మిగతా వారు కూడా
  • సాయంత్రంలోగా కేఈ ఎన్నికపై ప్రకటన!

కర్నూలు ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆయనకు పోటీగా నామినేషన్లు వేసిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడు జయప్రకాశ్ రెడ్డి సహా మిగతా అందరూ తమ తమ రాజీనామాలను ఈ ఉదయం ఉపసంహరించుకున్నారు. దీంతో కేఈ ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. జయప్రకాశ్ సహా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న మిగతావారూ తాము అభ్యర్థులుగా వైదొలగుతున్నట్టు ఎన్నికల అధికారికి పత్రాలను అందించారు. దీంతో ఈ సాయంత్రంలోగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటిస్తారని సమాచారం. కాగా, తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించిన బైరెడ్డి, చంద్రబాబుతో చర్చించిన తరువాత కేఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి మార్గం సుగమమైంది.

More Telugu News