priyadarshini: తన అందంతో నట్టేట ముంచే ప్రియదర్శిని ఈమే... ఫోటోలు విడుదల చేసిన పోలీసులు!

  • ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్టు సమాచారం
  • మహీంద్రా షోరూములో చెల్లని చెక్కులిచ్చి కార్ల కొనుగోలు
  • హైదరాబాద్ లోనూ బాధితులు
  • గాలిస్తున్నామన్న పోలీసులు

వరంగల్ లో ఓ ప్రముఖుడి కుమారుడిని ఐదంటే ఐదు రోజుల్లో ప్రేమ పేరిట ముగ్గులోకి దింపి, పెళ్లి చేసుకుని ఉడాయించిన చెన్నై యువతి ప్రియదర్శిని అలియాస్ స్నేహ గురించిన మరిన్ని వివరాలను, ఆమె ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఆమె బెంగళూరు పారిపోయిందని సమాచారం అందుతోందని అన్నారు. ఓ యువకుడికి డాక్టర్ గా పరిచయం చేసుకుని రూ. 5 లక్షలను, అతని స్నేహితుల నుంచి రూ. 10 లక్షలను ఆమె కాజేసిందని చెప్పారు. వరంగల్ లోని మహీంద్రా అండ్ మహీంద్రా షోరూములో రూ. 75 లక్షలకు చెక్కులిచ్చి నాలుగు కార్లు కొనుగోలు చేయగా, ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయని వెల్లడించారు.
ఈ కిలాడీ లేడీ మోసాలు వరంగల్ కు మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్ లోని రాంనగర్ ప్రాంతంలో ఉన్న హ్యుందాయ్ షోరూములో 17 లక్షల చెక్కులిచ్చి ఓ కారును కొనుగోలు చేసింది. వరంగల్ ఎంజీఎంలో ఆంకాలజిస్ట్ గా పనిచేస్తున్నానని నమ్మబలకడంతో షోరూమ్ నిర్వాహకులు మోసపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. బాగా డబ్బున్న వ్యక్తుల పిల్లలను ఎంచుకుని, వారిని ముగ్గులోకి దించి సీక్రెట్ గా వివాహం చేసుకుని అందిన కాడికి దోచుకుంటుందని, చెన్నై నుంచి రూ. 3 వేలతో వరంగల్ వచ్చి, దాదాపు రూ. కోటికి పైగా మోసం చేసిందని, ఆమె కోసం గాలిస్తున్నామని అన్నారు.

More Telugu News