Chandrababu: చంద్రబాబుతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భేటీ!

  • టీడీపీలో చేర‌తార‌ని ప్ర‌చారం
  • రాయ‌ల‌సీమ‌లోని సాగునీటి ప్రాజెక్టుల విష‌యంపై చంద్ర‌బాబును క‌లిశా
  • టీడీపీలో చేరే విష‌యంపై త‌రువాత ప్ర‌క‌ట‌న చేస్తా
  • చంద్రబాబు నన్ను టీడీపీలోకి ఆహ్వానించారు

కర్నూలు జిల్లా నేత బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి టీడీపీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ‌రావ‌తిలో సీఎం చంద్ర‌బాబుతో ఈ రోజు ఆయ‌న‌ భేటీ అయ్యారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... రాయ‌ల‌సీమ‌లోని సాగునీటి ప్రాజెక్టుల విష‌యంపై చంద్ర‌బాబును క‌లిశాన‌ని తెలిపారు. చంద్రబాబు తనను టీడీపీలో చేరాలని ఆహ్వానించారని తెలిపారు. ఆ పార్టీలో చేరే విష‌యంపై తాను త‌రువాత ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని వ్యాఖ్యానించారు.

కాగా, క‌ర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల పోటీ నుంచి ప్రతిపక్ష వైసీపీ తప్పుకున్న విష‌యం తెలిసిందే. బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరుడు ఒక‌రు కూడా ఈ బ‌రిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ నిన్న‌ బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డిని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. మిగిలిన అభ్య‌ర్థులు కూడా పోటీ నుంచి త‌ప్పుకుంటే ఎన్నిక ఏక్ర‌గ్రీవం అవ‌నుంది.  

More Telugu News