radhika: ‘నా మనసును కట్టిపడేసే క్షణం’ అంటూ ఓ ఫొటో పోస్ట్ చేసిన నటి రాధిక

  • బలాబలాలు తేల్చుకుందామన్నట్టుగా కూర్చున్న శరత్ కుమార్, కొడుకు రాహుల్
  • ఓ ట్వీట్ చేసిన రాధిక
  • ఈ ఫొటో ఏ సందర్భంలో తీశారో ప్రస్తావించని వైనం

ప్రముఖ దక్షిణాది నటి రాధికా శరత్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో శరత్ కుమార్, కొడుకు రాహుల్ సరదాగా బలాబలాలు తేల్చుకుందామా అన్నట్టు ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. ఈ ఫొటోను పోస్ట్ చేసిన రాధిక.. ‘నా మనసును కట్టిపడేసే క్షణం’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. కాగా, ఈ ఫొటోను ఏ సందర్భంలో ఎక్కడ తీసిన విషయాన్ని ఆమె ప్రస్తావించలేదు.

More Telugu News