Revanth Reddy: కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను అవమానించారు: రేవంత్ రెడ్డి

  • సైన్స్‌ కాంగ్రెస్‌ను ఓయూలో నిర్వహించలేమని తేల్చి చెప్పారు
  • రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు ముఖ్య‌మంత్రి క్షమాపణలు చెప్పాలి
  • హైకోర్టు విభజనపై కూడా టీఆర్ఎస్ నేత‌ల‌కు చిత్తశుద్ధి లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ... సైన్స్‌ కాంగ్రెస్‌ను ఉస్మానియా యూనివ‌ర్సిటీలో నిర్వహించలేమని కేసీఆర్ తేల్చి చెప్పార‌ని, ఇది తెలంగాణ ప్రజలను అవమానించడ‌మేన‌ని అన్నారు. రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు ముఖ్య‌మంత్రి క్షమాపణలు చెప్పాలని వ్యాఖ్యానించారు. కాగా, హైకోర్టు కోసం పోరాడుతున్నట్టుగా ఆ పార్టీ నేత‌లు డ్రామా లాడుతున్నార‌ని, అస‌లు హైకోర్టు విభజనపై తెలంగాణ అధికార పార్టీకి చిత్తశుద్ధి లేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.       

More Telugu News