atm: ఏటీఎంను పగులకొట్టి.. బ్యాంకుకు ఫోన్ చేసి చెప్పిన వ్యక్తి!

  • అమెరికాలోని ఫ్లోరిడాలో వింత ఘటన
  • డబ్బు అధికంగా వచ్చినందుకు గానూ ఏటీఎం ధ్వంసం
  • పోలీసులకు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు

ఏటీఎంలో సాంకేతిక సమస్య కారణంగా ఎంటర్ చేసిన దాని కంటే ఎక్కువగా డబ్బు వచ్చేస్తుండడం అతనికి నచ్చలేదు. అందుకే, ఆ ఏటీఎంను ధ్వంసం చేసేశాడు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. తాను ఎంటర్ చేసిన మొత్తం కన్నా ఎక్కువగా డబ్బు రావడంతో జోసెఫ్‌ అనే వ్యక్తి ఆగ్రహంతో ఏటీఎంను ధ్వంసం చేసి, ఆ విషయాన్ని బ్యాంకుకు ఫోన్ చేసి.. ఆ ఘన కార్యాన్ని చెప్పేశాడు. జోసెఫ్‌ నుంచి వచ్చిన ఫోన్ పట్ల బ్యాంకు సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేశారు.

More Telugu News