aadhaar: ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబ‌ర్లు.. 71.24 కోట్లు

  • లింక్ అయిన‌ బ్యాంక్ అకౌంట్లు 82 కోట్లు
  • వెల్ల‌డించిన కేంద్ర ఐటీ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌
  • మార్చి 31, 2018 వ‌ర‌కు రీ-వెరిఫికేష‌న్‌

దేశ‌వ్యాప్తంగా దాదాపు 71.24 కోట్ల మొబైల్ నంబ‌ర్లు ఆధార్‌తో అనుసంధాన‌మైన‌ట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ వెల్ల‌డించారు. అలాగే 82 కోట్ల బ్యాంక్ ఖాతాలు కూడా ఆధార్‌తో లింక్ అయ్యాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ వివ‌రాలు డిసెంబ‌ర్ 8, 2017 నాటి వ‌ర‌కు అంచ‌నా వేసిన‌వి. కొత్త మొబైల్ నంబ‌ర్ల‌కు ఆధార్ రీ-వెరిఫికేష‌న్‌ను మార్చి 31, 2018 లోగా చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న రాజ్య‌స‌భ‌కు తెలిపారు. ప్రివెన్ష‌న్ ఆఫ్ మ‌నీ లాండ‌రింగ్ 2005 చ‌ట్టం ప్ర‌కారం వ్య‌క్తిగ‌త బ్యాంక్ అకౌంట్‌కి 12 అంకెల ఆధార్ నెంబ‌ర్‌ను జోడించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News