pavan kalyan: 'అజ్ఞాతవాసి' సెన్సార్ ఒక రోజు ఆలస్యంగా!

  • ఈ నెల 30న 'అజ్ఞాతవాసి' సెన్సార్
  • వచ్చే నెల 10న భారీ విడుదల 
  • పవన్ కెరియర్లో 25వ సినిమా 
  • త్రివిక్రమ్ తో 3వ సినిమా  

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన 'అజ్ఞాతవాసి' సినిమాపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి వుంది. ఈ సినిమా థియేటర్స్ కి వచ్చే సమయం కోసం వాళ్లంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్ .. పాటలు అనూహ్యమైన స్థాయిలో ఆకట్టుకోవడమే అందుకు కారణం.

 జనవరి 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన సెన్సార్ కార్యక్రమాలకు వెళ్లాల్సి వుంది. అయితే కొన్ని కారణాల వలన మరుసటి రోజుకు వాయిదాపడి, ఈ నెల 30వ తేదీన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుందని చెబుతున్నారు.

పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, సీనియర్ కథానాయికలు ఖుష్బూ .. ఇంద్రజ కీలకమైన పాత్రలను పోషించారు. పవన్ కల్యాణ్ కి ఇది 25వ సినిమా కావడం .. త్రివిక్రమ్ తో చేస్తోన్న మూడవ సినిమా కావడంతో ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.      

More Telugu News