shraddha kapoor: హీరోయిన్ శ్రద్ధా కపూర్ పై క్రిమినల్ కేసు నమోదు

  • కేసు వేసిన దుస్తుల కంపెనీ
  • 'హసీనా పార్కర్' టైటిల్స్ లో తమ పేరు వేయలేదని పిటిషన్
  • దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు

బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవిత కథ ఆధారంగా 'హసీనా పార్కర్' అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అపూర్వ లఖియా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదలైంది. సినిమా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ శ్రద్ధాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఈ సినిమాలో శ్రద్ధా వేసుకున్న దుస్తులను ముంబైకి చెందిన ఓ ప్రముఖ దుస్తుల కంపెనీ డిజైన్ చేసింది. సదరు కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకునే ముందు టైటిల్స్ లో దుస్తుల కంపెనీ పేరు కూడా వేస్తామని నిర్మాత నహిద్ ఖాన్ మాట ఇచ్చారట. అయితే, సినిమా మొత్తంమీద ఆ కంపెనీ పేరు ఎక్కడా కనబడలేదు. దీంతో, సదరు కంపెనీ యాజమాన్యం నిర్మాత నహిద్ ఖాన్ తో పాటు శ్రద్ధా కపూర్ పై ముంబైలోని అంధేరీ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై పోలీసు అధికారులు స్పందిస్తూ, దర్యాప్తు చేసిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. 

More Telugu News