sai dharam tej: చైతూ చేయవలసిన సినిమానే తేజు చేస్తున్నాడట!

  • చైతూ కోసం కథ రెడీ చేసుకున్న శ్రీనివాస రెడ్డి 
  • చివరి నిమిషంలో నిర్మాత వెనకడుగు 
  • ఆ కథతో తేజును ఒప్పించిన వినాయక్

గతంలో నాగార్జునతో దర్శకుడు శ్రీనివాసరెడ్డి 'ఢమరుకం' సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో నాగచైతన్యతో సినిమా చేయడానికి ఆయన రెడీ అయ్యాడు. ఆకుల శివ మంచి కథను సిద్ధం చేశాడు కూడా. అయితే చివరి నిమిషంలో ఆ నిర్మాత వెనకడుగు వేయడంతో, ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఆకుల శివ ఈ కథను వినాయక్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఈ కథను సాయిధరమ్ తేజ్ తో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, వినాయక్ ఆయనకి వినిపించాడట. సాయిధరమ్ తేజ్ కి అది బాగా నచ్చడంతో, వెంటనే అంగీకరించాడని అంటున్నారు. అలా చైతూ చేయవలసిన సినిమా తేజూకి వెళ్లింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి, త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు.       

More Telugu News