charan: యువరాజుగా కనిపించనున్న చరణ్!

  • చరణ్ తదుపరి చిత్రం బోయపాటితో 
  • రాజస్థాన్ లో ఫస్టు షెడ్యూల్ 
  • కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ 
  • కీలక పాత్రలో రమ్యకృష్ణ

ప్రస్తుతం చరణ్ కథానాయకుడిగా 'రంగస్థలం' రూపొందుతోంది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాను మార్చి 30వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత బోయపాటితో కలిసి చరణ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను రాజస్థాన్ లో ప్లాన్ చేశారు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాలో చరణ్ రాజవంశస్థుడిగా కనిపించనున్నాడట. అంటే .. యువరాజుగా కొంతసేపు అలరిస్తాడన్న మాట. అందువల్లనే రాజస్థాన్ లోని 'రాజమహల్'లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఈ రాజమహల్ లో 30 శాతం చిత్రీకరణను జరపనున్నట్టు సమాచారం. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించనుండగా, ఒక కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందని చెబుతున్నారు. 

More Telugu News