India: టీ20ల్లో పాక్ ఫ‌స్ట్.. టీమిండియా సెకండ్‌!

  • శ్రీలంక‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్‌
  • 121 పాయింట్ల‌తో టీమిండియా
  • 124 పాయింట్ల‌తో పాక్‌
  • మూడు, నాలుగ‌వ స్థానాల్లో న్యూజిలాండ్ (120), వెస్టిండీస్ (120)

ఫార్మాట్ ఏదైనా ఘ‌న విజ‌యాల‌తో దూసుకుపోతోన్న టీమిండియా టీ20ల్లో నిన్న‌టి వ‌ర‌కు 119 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో ఉంది. కాగా, శ్రీలంక‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో మూడు విజ‌యాల‌తో క్లీన్ స్వీప్ చేసి అద‌ర‌గొట్టిన టీమిండియా.. తాజాగా ఐసీసీ ప్ర‌క‌టించిన టీ20 ర్యాంకింగ్స్‌లో 121 పాయింట్ల‌తో రెండో స్థానంలోకి దూసుకువ‌చ్చింది. ఇక 124 పాయింట్ల‌తో పాకిస్థాన్‌ మొద‌టి స్థానంలో ఉంది. మూడు, నాలుగ‌వ స్థానాల్లో న్యూజిలాండ్ (120), వెస్టిండీస్ (120) ఉండ‌గా ఐదో స్థానంలో ఇంగ్లండ్ (119) ఉంది. కాగా, టెస్టుల్లో టీమిండియా 124 పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో, వ‌న్డేల్లో 119 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉన్న విష‌యం తెలిసిందే.

More Telugu News