serena williams: మళ్లీ రాకెట్ పట్టబోతున్న సెరెనా విలియమ్స్.. ముబదాలా ఛాంపియన్‌షిప్‌లో రీ ఎంట్రీ

  • కూతురికి జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత మొద‌టిసారి
  • స్ప‌ష్టం చేసిన ఛాంపియ‌న్‌షిప్ నిర్వాహ‌కులు
  • గ‌త జ‌న‌వ‌రిలో చివ‌రి మ్యాచ్ ఆడిన సెరెనా

టెన్నిస్ స్టార్‌, న‌ల్ల‌క‌లువ సెరెనా విలియ‌మ్స్ మ‌ళ్లీ రాకెట్ ప‌ట్ట‌బోతోంది. కూతురు అలెక్సిస్ కి జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత ఆమె తిరిగి మ్యాచ్ ఆడ‌బోతోంది. అబుదాబిలో జ‌ర‌గ‌నున్న ముబ‌దాలా ప్ర‌పంచ టెన్నిస్ ఛాంపియ‌న్‌షిప్‌లో ఆమె ఆడ‌నుంది. శ‌నివారం జ‌ర‌గ‌బోతున్న మ్యాచ్‌లో ఆమె, ఫ్రెంచ్ ఓపెన్ విజేత జెలేనా ఒస్తాపెంకోతో త‌ల‌ప‌డ‌నున్న‌ట్లు ఛాంపియ‌న్‌షిప్ నిర్వాహ‌కులు తెలిపారు.

గ‌త జ‌న‌వ‌రిలో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ త‌ర్వాత సెరెనా మ‌ళ్లీ రాకెట్ ప‌ట్టుకోలేదు. ఆమె సెప్టెంబ‌ర్‌లో కూతురికి జ‌న్మ‌నిచ్చింది. నిజానికి మ‌ళ్లీ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌తోనే ఆమె రీ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని అంద‌రూ అనుకున్నారు. తాను మ‌ళ్లీ ఆడ‌బోతున్నందుకు చాలా ఆనందంగా ఉంద‌ని సెరెనా ప్ర‌క‌టించింది.

More Telugu News