Congress: అవిశ్రాంతంగా దేశ పురోభివృద్ధికి కృషి చేసేందుకు ప్ర‌జ‌ల‌కు ఈ పండుగ స్ఫూర్తినిస్తుంది: ర‌ఘువీరారెడ్డి

  • ఏపీ ప్ర‌జ‌ల‌కు క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపిన ర‌ఘువీరారెడ్డి
  • ఎల్ల‌లు లేని ఆనందం, ఆశ‌ల క‌ల‌యికే క్రిస్మ‌స్‌
  • ప్రేమ, త్యాగం లాంటి ఎన్నో సుగుణాల‌తో కూడిన ఏసుక్రీస్తు సందేశం 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌జ‌ల‌కు క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఎల్ల‌లు లేని ఆనందం, ఆశ‌ల క‌ల‌యికే క్రిస్మ‌స్ సంబ‌ర‌మ‌ని అన్నారు. ప్రేమ, త్యాగం, శాంతి, సంతోషం లాంటి ఎన్నో సుగుణాల‌తో కూడిన ఏసుక్రీస్తు సందేశాన్ని క్రిస్మ‌స్ మ‌న‌కు గుర్తు చేస్తుంద‌న్నారు.

అవిశ్రాంతంగా దేశ పురోభివృద్ధికి కృషి చేసేందుకు ప్ర‌జ‌ల‌కు ఈ పండుగ స్ఫూర్తినిస్తుంద‌న్నారు. క్రిస్మ‌స్ పండుగ ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల్లోనూ సంతోషాన్ని, ఆశ‌ల‌ను నింపుతుంద‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ ఈ క్రిస్మ‌స్ పండుగ సుఖ సంతోషాలు నింపాల‌ని కోరుకుంటూ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని అన్నారు.

More Telugu News