bitcoin: అతిథుల‌కు వినూత్న ష‌ర‌తు.. బ‌హుమ‌తులుగా బిట్‌కాయిన్లు మాత్ర‌మే ఇవ్వాలన్న కొత్త జంట!

  • కొత్త పంథాలో పెళ్లి చేసుకున్న బెంగళూరు జంట
  • బ‌హుమ‌తిగా లక్ష రూపాయ‌ల విలువైన బిట్‌కాయిన్లు పొందిన వైనం
  • అందుకోసం జేబ్‌పే యాప్‌తో ఒప్పందం

బెంగ‌ళూరుకు చెందిన ప్ర‌శాంత్ శ‌ర్మ‌, నీతిశ్రీలు త‌మ పెళ్లిని ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. స్వ‌త‌హాగా ఓ డిజిట‌ల్ స్టార్ట‌ప్‌కి యాజ‌మానులుగా ఉండ‌టం, ఇంకా త‌మ బంధు, స్నేహితుల వ‌ర్గంలో అంద‌రూ టెకీలే ఉండ‌టంతో పెళ్లికి వ‌చ్చిన వారు బ‌హుమ‌తిగా బిట్‌కాయిన్లు మాత్ర‌మే ఇవ్వాల‌ని ష‌ర‌తు విధించారు. దీంతో వారి పెళ్లికి హాజ‌రైన 200 మంది అతిథుల్లో దాదాపు 185 మంది అతిథులు బిట్‌కాయిన్ల రూపంలో బ‌హుమ‌తి ఇచ్చారు. చివ‌రికి వారు ఏకంగా లక్ష రూపాయ‌ల విలువైన బిట్‌కాయిన్లు పొందిన‌ట్లు తెలుస్తోంది.

బిట్‌కాయిన్ ద్వారా చెల్లించే అవ‌కాశాన్ని అతిథుల‌కు క‌ల్పించడం కోసం వారు జేబ్‌పే యాప్‌తో ఒప్పందం చేసుకున్నారు. అతిథులు ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, బిట్‌కాయిన్లు కొని, పెళ్లి జంట‌కు బ‌హుమ‌తిగా ఇచ్చే అవ‌కాశం ఉంది. వీరు చేసిన ఈ వినూత్న ప్ర‌యోగాన్ని నెటిజ‌న్లు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

More Telugu News