mohan babu: క్రిస్మస్ కానుకగా 'గాయత్రి' ఫస్టులుక్ రిలీజ్

  • మోహన్ బాబు ప్రధాన పాత్రలో 'గాయత్రి' 
  • ద్విపాత్రాభినయం అంటూ టాక్ 
  • ముఖ్యమైన పాత్రలో విష్ణు  

శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు 'గాయత్రి' అనే ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారే గానీ, ఇంతవరకూ ఫస్టులుక్ ను మాత్రం రిలీజ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి క్రిస్మస్ కానుకగా ఈ నెల 25వ తేదీన ఫస్టులుక్ ను విడుదల చేస్తున్నారు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలారు.

 మదన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడని అంటున్నారు. విష్ణు ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా, శ్రియ .. నిఖిలా విమల్ .. అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్టులుక్ తో ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతాయో చూడాలి మరి.  

More Telugu News