Salman Khan: ఎస్సీల గురించి అస‌భ్యంగా మాట్లాడారంటూ స‌ల్మాన్ ఖాన్‌, శిల్పా శెట్టిల‌పై కేసు!

  • ఓ కార్య‌క్ర‌మంలో భాంగి వ‌ర్గీయుల‌ను ప్ర‌స్తావించిన శిల్పా, సల్మాన్‌
  • మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచార‌ని ఫిర్యాదు
  • 'టైగ‌ర్ జిందా హై' విడుద‌ల అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రిక‌

త‌మ సామాజిక వ‌ర్గం గురించి అస‌భ్యంగా మాట్లాడారంటూ ఆగ్రాకు చెందిన వాల్మీకి వ‌ర్గాలు న‌టులు స‌ల్మాన్ ఖాన్‌, శిల్పా శెట్టిల‌పై ఫిర్యాదు చేశారు. ముంబై, ఢిల్లీల్లో వీరిపై కేసు న‌మోదైంది. ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న 'టైగ‌ర్ జిందా హై' చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా స‌ల్మాన్ ఖాన్ ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఆ కార్య‌క్ర‌మానికి న‌టి శిల్పా శెట్టి న్యాయ‌నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అందులో ఓ జ‌ట్టు చేసిన డ్యాన్స్ గురించి మాట్లాడుతూ... 'భాంగి' వ‌ర్గం వారు చేసే డ్యాన్స్‌లా ఉంద‌ని కామెంట్ చేశారు.

భాంగి అనేవారు మైనార్టీ వ‌ర్గానికి చెందిన‌వారు. ఈ కామెంట్ల‌తో త‌మ మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచార‌ని వారిపై చ‌ర్య తీసుకోవాల‌ని, లేదంటే సినిమా విడుద‌ల‌ను అడ్డుకుంటామ‌ని ఆగ్రా వాల్మీకి వ‌ర్గాలు హెచ్చ‌రించాయి. వీరి ఫిర్యాదు మేర‌కు ఐఅండ్‌బీ శాఖ, ఢిల్లీ, ముంబై పోలీస్‌ కమిషనర్లు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎన్సీఎస్సీ(నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఎస్సీ) ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News