kim jong un: ఖండాంతర క్షిపణులకు ఆంత్రాక్స్ బ్యాక్టీరియా అమర్చే పనిలో కిమ్ జాంగ్

  • రసాయన ఆయుధాలను తయారు చేసే పనిలో ఉత్తర కొరియా
  • కొనసాగుతున్న ప్రయోగాలు
  • జపాన్ పత్రికలో కథనం

వరుసగా అణు ప్రయోగాలు, క్షిపణి ప్రయోగాలు చేస్తూ ఆయుధ సంపత్తి కోసం ఆరాటపడుతున్న ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ చేష్టలు శ్రుతిమించుతున్నాయి. తాజాగా రసాయన ఆయుధాలను తయారు చేసేందుకు కిమ్ జాంగ్ ఉవ్విళ్లూరుతున్నారనే వార్త వెలుగు చూసింది. ఖండాంతర క్షిపణులకు ఆంత్రాక్స్ బ్యాక్టీరియాను అమర్చి శత్రు దేశాలపై ప్రయోగించాలని కిమ్ భావిస్తున్నట్టు జపాన్ పత్రిక 'అసాహీ' ఓ కథనాన్ని ప్రచురించింది. ఇదే సమాచారం అమెరికా వద్ద కూడా ఉందని తెలిపింది. ఖండాంతర క్షిపణి ప్రయోగం వల్ల వెలువడే ఉష్ణానికి ఆంత్రాక్స్ బ్యాక్టీరియా బతుకుతుందా? అనే అంశాన్ని నిర్ధారించుకునేందుకు ప్రస్తుతం ప్రయోగాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

ఆంత్రాక్స్ వ్యాధి సోకిన తొలి దశలో రెండు, మూడు రోజుల పాటు ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత తీవ్ర జ్వరం, ఛాతి నొప్పి, షాక్ కు గురవడం, శ్వాస తీసుకోలేక పోవడం తదితర లక్షణాలు ప్రారంభమవుతాయి. అనంతరం మూడవ దశకు చేరుకున్న రెండు, మూడు రోజులకి వ్యాధి సోకిన వ్యక్తికి కాని, జీవికి కాని మరణం తప్పదు.

More Telugu News