2g scam: 2జీ స్కాం తీర్పు.. బీజేపీ, అన్నాడీఎంకేలపై ఖుష్బూ ఫైర్

  • 2జీ స్కాం తీర్పుపై స్పందించిన ఖుష్బూ
  • నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది
  • బీజేపీ, అన్నాడీఎంకేలు క్షమాపణ చెబుతాయా?


దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన 2జీ కుంభకోణం కేసులో కనిమొళి, రాజాలకు ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతినిధి, సినీ నటి ఖుష్బూ మండిపడ్డారు. కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిందని... ఈ నేపథ్యంలో బీజేపీ, అన్నాడీఎంకేలు క్షమాపణలు చెబుతాయా? అంటూ సెటైర్ వేశారు. 2జీ స్కాంకు సంబంధించి కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిపిందే. ఈ నేపథ్యంలోనే, ఖుష్బు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 

More Telugu News