haribabu: నెల‌కి ఒక‌సారి వ‌చ్చి పోలవ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలిస్తామ‌ని గ‌డ్క‌రీ చెప్పారు: ఢిల్లీలో ఎంపీ హ‌రిబాబు

  • పోల‌వ‌రం విష‌యంలో గ‌డ్క‌రీ స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌తో ఉన్నారు
  • 2019 కల్లా పోల‌వ‌రాన్ని పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంతో ఉన్నామ‌న్నారు
  • నెల రోజుల్లో పోల‌వ‌రం ప‌నుల్లో పురోగ‌తి ఉంటుందని తెలిపారు

నెల‌కి ఒక‌సారి వ‌చ్చి పోలవ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలిస్తామ‌ని కేంద్ర మంత్రి నితిన్‌ గ‌డ్క‌రీ చెప్పారని బీజేపీ ఎంపీ హ‌రిబాబు తెలిపారు. ఈ రోజు పోల‌వ‌రం ప్రాజెక్టుపై ప‌లువురు ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎంపీ హ‌రిబాబు మాట్లాడుతూ... పోల‌వ‌రం ప్రాజెక్టు ఏపీకి ఎంతో ముఖ్య‌మ‌ని, ఆ ప్రాజెక్టు పూర్తి కావాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను గ‌డ్క‌రీకి వివ‌రించామ‌ని అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌తో ఉన్నారని చెప్పారు. 2019 కల్లా పోల‌వ‌రాన్ని పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంతో ఉన్నామ‌ని హామీ ఇచ్చారని అన్నారు.

ప్ర‌స్తుతం ప‌నుల కొన‌సాగింపుకు కావాల్సిన యంత్ర సామ‌గ్రిని గుత్తేదారులు స‌మ‌కూర్చుకున్నారని అన్నారు. నెల రోజుల్లో పోల‌వ‌రం ప‌నుల్లో పురోగ‌తి ఉంటుందని తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ముందుకు వెళ్ల‌డంతో ఇక‌పై ఎటువంటి ఆటంకాలు ఉండ‌వ‌ని గ‌డ్క‌రీ చెప్పారని అన్నారు.

More Telugu News