Police: జ‌గిత్యాలలో స్కూల్ విద్యార్థుల‌ను బ‌య‌ట‌కు పంపి.. త‌నిఖీలు చేప‌డుతోన్న పోలీసులు

  • బాంబు ఉంద‌ని చెప్పిన ఓ ఆగంతు‌కుడు
  • ప్ర‌స్తుతం చుక్కా రామయ్య, గౌతమి మోడల్‌ స్కూళ్లలో పోలీసులు
  • బాంబు స్క్వాడ్‌ సిబ్బంది కూడా వ‌చ్చిన వైనం

జగిత్యాలలో ఓ ఆగంతు‌కుడు అల‌జ‌డి రేపాడు. ఆ ప్రాంతంలోని చుక్కా రామయ్య, గౌతమి మోడల్‌ స్కూళ్లలో బాంబులు పెట్టిన‌ట్లు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వెంట‌నే ఆయా స్కూళ్ల‌కు చేరుకుని త‌నిఖీలు చేప‌ట్టారు. ఆ రెండు స్కూళ్ల‌లోనే కాకుండా జగిత్యాలలోని ప‌లు ప్రైవేటు స్కూళ్లలోనూ పోలీసులు తనిఖీలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. బాంబు స్క్వాడ్‌ సిబ్బందితో వ‌చ్చిన పోలీసులు విద్యార్థులంద‌రినీ బ‌య‌ట‌కు పంపించేసి క్షుణ్ణంగా సోదాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను మాత్రం మీడియాకు చెప్ప‌డం లేదు.   

More Telugu News