Jagan: రూ. 200 కోట్ల బిట్ కాయిన్ దందాలో జగన్ వాటా ఎంత?: వర్ల రామయ్య

  • పాకిస్థానీల కంటే వైసీపీవారే ప్రమాదకరం
  • జగన్ ది పీడయాత్ర
  • జగన్ కు సైకం రామకృష్ణారెడ్డి అత్యంత సన్నిహితుడు

నేర చరిత్ర కలిగిన పార్టీ వైసీపీ అని, ఆ పార్టీలో ఉన్నవారందరికీ నేర చరిత్ర ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థానీల కంటే వైసీపీవారే ప్రమాదకరమని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు పాదయాత్రలు చేపడుతున్నారని... జగన్ చేస్తున్న పాదయాత్ర ఓ పీడయాత్ర అని విమర్శించారు. బిట్ కాయిన్ దందాలో నిందితుడైన సైకం రామకృష్ణారెడ్డి... జగన్ కు అత్యంత సన్నిహితుడని ఆరోపించారు. రూ. 200 కోట్ల మేర జరిగిన ఈ బిట్ కాయిన్ దోపిడీలో జగన్ వాటా ఎంత? అని ప్రశ్నించారు.  

More Telugu News