Australia: చేతులెత్తేసి ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లండ్... యాషెస్ కంగూరూలదే!

  • మూడో మ్యాచ్ లోనే ఫలితం
  • 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు
  • 3-0 తేడాతో యాషెస్ సీరీస్ ఆసీస్ కైవసం

ఐదు టెస్టు మ్యాచ్ ల యాషెస్ సీరీస్ లో ఇంగ్లండ్ ఘోరంగా ఓడిపోయింది. మూడు టెస్టులకే సీరీస్ ఫలితం తేలిపోయింది. పెర్త్ లో జరిగిన టెస్టులోనూ ఘనవిజయం సాధించిన ఆస్ట్రేలియా, మరో రెండు టెస్టులు మిగిలుండగానే, 3-0 తేడాతో సీరీస్ ను సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో ఓ దశలో 368/4 వద్ద ఉన్న ఇంగ్లండ్ మ్యాచ్ ని డ్రా చేసుకుంటుందని, తరువాతి మ్యాచ్ ల్లో పుంజుకునే అవకాశాలు ఉంటాయని ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులు భావించినా, వారి ఆశలు కలలుగానే మిగిలాయి. ఈ మ్యాచ్ లో కంగారూలు రెచ్చిపోగా, 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తుగా ఓడింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్ లూ నామమాత్రమే అయ్యాయి. దీంతో బాక్సింగ్ డే టెస్టుపై అభిమానుల్లో ఆసక్తి పోయినట్లయిందని క్రీడా పండితులు వ్యాఖ్యానించారు.

More Telugu News