Telangana: కేసీఆర్‌కు అమెరికా శ్వేతసౌధ సలహాదారు ఇవాంకా ట్రంప్ లేఖ

  • ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని మర్చిపోలేనన్న ఇవాంకా
  • అనిర్వచనీయమంటూ ప్రశంసలు
  • అవకాశం దొరికితే మరోమారు హైదరాబాద్‌కు వస్తానన్న ట్రంప్ కుమార్తె

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, శ్వేతసౌధ సలహాదారు ఇవాంకా ట్రంప్ లేఖ రాశారు. ఇటీవల నిర్వహించిన ప్రపంచ వాణిజ్యవేత్తల సదస్సుకు హాజరైన ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిన తీరు అనిర్వచనీయమని పేర్కొన్న ఇవాంకా అవకాశం దొరికితే మరోమారు హైదరాబాద్ వస్తానని లేఖలో పేర్కొన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తనకు లభించిన ఆతిథ్యం, కానుకను ఎప్పటికీ మర్చిపోలేనని ఇవాంకా పేర్కొన్నారు.

More Telugu News