sidda ramaiah: గుజ‌రాత్‌ ఫ‌లితాల ప్ర‌భావం క‌ర్ణాట‌క‌లో ఉండ‌దు: సీఎం సిద్ధ‌రామ‌య్య‌

  • క‌ర్ణాట‌క‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాదే విజ‌యం
  • ఓ రాష్ట్రంలో వ‌చ్చిన ఫ‌లితాల ప్ర‌భావం మ‌రో రాష్ట్రంపై ఎలా ఉంటుంది?
  • అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి రాహుల్ గాంధీకి మొద‌టి గిఫ్ట్ మేమే ఇస్తాం

గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌య దుందుభి మోగించిన విష‌యం తెలిసిందే. ఇక బీజేపీ ముందున్న ప్ర‌ధాన లక్ష్యం క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మే. వ‌చ్చే ఏడాదే ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గుజ‌రాత్‌, హిమాచల్ ప్ర‌దేశ్‌లో గెలిచిన బీజేపీ ఇక క‌ర్ణాట‌క‌లోనూ గెలిచి చూపిస్తామ‌ని అంటోంది.

ఈ నేప‌థ్యంలో స్పందించిన క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం త‌మ రాష్ట్రంపై ప‌డ‌ద‌ని వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రంలో ఓ పార్టీ గెలిస్తే అవే ఫ‌లితాలు ఇత‌ర రాష్ట్రంలోనూ ఎలా వ‌స్తాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తాము గెలిచి చూపిస్తామ‌ని, త‌మ పార్టీ జాతీయాధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ రాహుల్ గాంధీకి తాము మొద‌టి గిఫ్ట్ ఇస్తామ‌ని అన్నారు. 

More Telugu News