BJP: విజ‌య గ‌ర్వంతో మోదీ స‌హా బీజేపీ అధిష్ఠానం స‌మావేశం.. మీరూ చూడండి!

  • పాల్గొన్న అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, అరుణ్‌జైట్లీ
  • కాసేప‌ట్లో మోదీ ప్ర‌సంగం
  • భార‌త్ మాతా కీ జై నినాదంతో మారుమోగుతోన్న బీజేపీ కార్యాల‌యం

గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌య దుందుభి మోగించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విజ‌య గ‌ర్వంతో ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ పార్టీ అధిష్ఠానం భేటీ అయింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, అరుణ్ జైట్లీతో పాటు ప‌లువురు నేత‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. మ‌రికాసేప‌ట్లో ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగించ‌నున్నారు. ఆ ప్రాంగ‌ణ‌మంతా భార‌త్ మాతా కీ జై నినాదాల‌తో మారు మోగి పోతోంది.



More Telugu News