Gujarath: గుజ‌రాత్‌లో ముగిసిన ఓట్ల లెక్కింపు.. ఆయా పార్టీలు సాధించిన అసెంబ్లీ స్థానాల వివ‌రాలు!

  • గుజరాత్‌లో బీజేపీ గెలుపొందిన‌ మొత్తం స్థానాలు: 99
  • కాంగ్రెస్ కూట‌మి: 80
  • ఇత‌రులు: 3
  • హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన బీజేపీ

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల‌ లెక్కింపు ముగిసింది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన 92 స్థానాల్ని భార‌తీయ జ‌నతా పార్టీ ఇప్ప‌టికే సాధించిన విష‌యం తెలిసిందే. గుజరాత్‌లో బీజేపీ మొత్తం 99 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్ కూట‌మి 80 స్థానాల‌ను సొంతం చేసుకుంది. ఇక ఇత‌రులు 3 స్థానాల్లో విజ‌యం పొందారు. కాగా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (35) ను దాటేసి దూసుకెళుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 41 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ మ‌రో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో గెలుపొంది 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఇత‌రులు 3 స్థానాల్లో గెలుపొందారు.  

More Telugu News