xiaomi: డిసెంబ‌ర్ 20న షియోమీ నెం.1 ఎమ్ఐ ఫ్యాన్ సేల్‌... రెడ్‌మీ మొబైళ్ల‌పై భారీ డిస్కౌంట్లు!

  • రూ. 1కే స్మార్ట్‌ఫోన్లు, యాక్సెస‌రీస్‌
  • రూ. 32,999కే ఎమ్ఐ మిక్స్‌2
  • రెండ్రోజుల పాటు జ‌ర‌గ‌నున్న సేల్‌

క్రిస్‌మ‌స్, న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా చైనా మొబైల్ త‌యారీ సంస్థ షియోమీ, డిసెంబ‌ర్ 20 - 21 తేదీల్లో 'నెం.1 ఎమ్ఐ ఫ్యాన్ సేల్‌' పేరిట ఓ సేల్‌ని నిర్వహించ‌నుంది. రెండు రోజుల పాటు ఎమ్ఐ అధికారిక వెబ్‌సైట్‌లో జ‌ర‌గ‌నున్న ఈ సేల్‌లో మ‌ధ్యాహ్నం 2గం.ల‌కు రూ. 1 ఫ్లాష్ సేల్ కూడా ఉంది. దీని ద్వారా రూ. 1కే స్మార్ట్‌ఫోన్లు, యాక్సెస‌రీస్‌ను అంద‌జేయ‌నుంది. వీటితో పాటు రెడ్‌మీ మొబైళ్ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను కూడా అంద‌జేయ‌నుంది.

రూ. 35,999 విలువ గ‌ల షియోమీ ఎమ్ఐ మిక్స్ 2 ఫోన్‌ను రూ. 32,999కి అంద‌జేయ‌నుంది. అలాగే రెడ్‌మీ 4, రెడ్‌మీ నోట్‌4, రెడ్‌మీ వై1 లైట్‌, ఎరుపు రంగు రెడ్‌మీ ఎమ్ఐ ఏ1, రెడ్‌మీ 5ఏ ఫోన్ల‌పై కూడా డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. అయితే ఎంత డిస్కౌంట్‌, ఏ మోడ‌ల్‌ను అంద‌జేయ‌నున్నార‌నే సంగ‌తిని మాత్రం వెల్ల‌డించ‌లేదు. రివార్డు ఎమ్ఐ యూజ‌ర్ల‌కు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12గం.ల నుంచే ఈ సేల్ అందుబాటులో ఉండ‌నుంది. కేవ‌లం స్మార్ట్‌ఫోన్ల మీదే కాకుండా షియోమీ వారి యాక్సెస‌రీల‌ను కూడా త‌క్కువ రేటుకి అందించ‌నుంది.

More Telugu News