bjp: పుట్ట‌గొడుగు బొమ్మ ఉన్న కేకును క‌ట్ చేసిన బీజేపీ కార్య‌క‌ర్త‌లు

  • అల్పేశ్ ఠాకూర్ మాట‌ల‌కు కౌంట‌ర్‌
  • తైవాన్ పుట్ట‌గొడుగులంటూ ఛ‌లోక్తులు
  • ఫొటోలు ట్వీట్ చేసిన బీజేపీ ప్ర‌తినిధి

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ నాయ‌కుడు అల్పేశ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను, ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత బీజేపీ కార్య‌క‌ర్త‌లు తెలివిగా తిప్పికొట్టారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తెల్ల‌గా క‌నిపించ‌డానికి, ఆయ‌న తైవాన్ నుంచి దిగుమ‌తి చేసుకున్న పుట్ట‌గొడుగులు తిన‌డ‌మే కార‌ణ‌మ‌ని అల్పేశ్ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

ఈ మాట‌ల‌ను గుర్తుపెట్టుకున్న బీజేపీ నేత‌లు కేకు మీద పుట్ట‌గొడుగు బొమ్మ‌లు వేయించి త‌మ విజ‌యానికి గుర్తుగా కట్ చేశారు. ఈ కేక్ క‌ట్టింగ్ ఫొటోల‌ను బీజేపీ ప్ర‌తినిధి తాజింద‌ర్ బ‌గ్గా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. `ఇది తైవాన్ నుంచి తెప్పించిన పుట్ట‌గొడుగుల కేక్‌` అంటూ ఛ‌లోక్తి విసిరారు.

More Telugu News