ys jagan: త్వరలోనే మంచి రోజులు వస్తాయి.. ధైర్యంగా ఉండండి: జగన్ భరోసా

  • 38వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర
  • కష్టాలను చెప్పుకున్న గొర్రెల కాపర్లు
  • అధికారంలోకి రాగానే కష్టాలను తీరుస్తానన్న జగన్

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 38వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగన్ వద్దకు గొర్రెల కాపర్లు వచ్చారు. 150 గొర్రెలను కొంటే 36 గొర్రెలు చనిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన గొర్రెలకు ఇన్స్యూరెన్స్ అందడం లేదని చెప్పారు. ఆ తర్వాత జగన్ మాట్లాడుతూ త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. త్వరలోనే మన ప్రభుత్వం రాబోతోందని అంత వరకు ఓపిక పట్టాలని ధైర్యం చెప్పారు. తాను అధికారంలోకి రాగానే అందరి కష్టాలను తీరుస్తానని చెప్పారు. 

More Telugu News