BJP: గుజ‌రాత్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు మెజార్టీ సాధించిన బీజేపీ.. అంబ‌రాన్నంటిన సంబ‌రాలు!

  • మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్న బీజేపీ
  • ఇప్ప‌టికి 92 స్థానాల్లో గెలుపు, 8 స్థానాల్లో ఆధిక్యం
  • కాంగ్రెస్ కూట‌మి 73 స్థానాల్లో విజ‌యం, 6 స్థానాల్లో ఆధిక్యం

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌య దుందుభి మోగించింది. ఇప్ప‌టికి 92 స్థానాల్లో విజ‌యం సాధించి ప్ర‌భుత్వ ఏర్పాటుకు మెజార్టీని పొందింది. మ‌రో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో గుజ‌రాత్‌లో బీజేపీ వ‌రుస‌గా ఐదోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. మ‌రోవైపు కాంగ్రెస్ కూట‌మి 73 స్థానాల్లో విజ‌యం సాధించి, 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇత‌రులు 2 స్థానాల్లో గెలుపొంది, 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

కాగా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో బీజేపీ 20 స్థానాల్లో గెలుపొంది, 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో గెలిచి 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇత‌రులు 3 స్థానాల్లో గెలుపొంది, 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ నేత‌ల సంబ‌రాలు అంబ‌రాన్నంటుతున్నాయి.

More Telugu News