gujarat elections: గుజరాత్ లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రావడానికి కారణం ఇదే!: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి గెహ్లాట్

  • మోదీ భావోద్వేగాలను రెచ్చగొట్టారు
  • ఓడిపోతే గుజరాత్ పరువు పోతుందంటూ ప్రచారం చేశారు
  • అసలైన విజయం రాహుల్ గాంధీదే

గుజరాత్ ఎన్నికల్లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఈ ఫలితాలపై గుజరాత్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపై బీజేపీ ప్రచారం చేసిందని చెప్పారు. తాను గుజరాత్ కు చెందినవాడినని, ఇక్కడ బీజేపీ ఓడిపోతే గుజరాత్ గౌరవానికి భంగం కలుగుతుందంటూ మోదీ ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ మాత్రం దళితులు, గిరిజనులు, రైతులు, వ్యాపారులకు సంబంధించిన అంశాలపై ప్రచారం చేసిందని చెప్పారు. గుజరాత్ లో ఫలితాలు ఎలా వచ్చినా... అసలైన విజయం సాధించింది మాత్రం కాంగ్రెస్, రాహుల్ గాంధీలేనని తెలిపారు. గుజరాత్ లో గెలుపుకైనా, ఓటమికైనా రాహుల్ గాంధీ బాధ్యత తీసుకుంటారా అంటూ మీడియా ప్రశ్నించగా... ఇది ఊహాజనిత ప్రశ్న అంటూ సమాధానమిచ్చారు. 

More Telugu News