allu shirish: 'ఒక్క క్షణం' కొరియన్ సినిమాకి కాపీనా?.. కాదంటున్న అల్లు శిరీష్!

  • 'ప్యారలల్ లైఫ్' నేను చూశాను 
  • ఆ కథ వేరు .. ఈ కంటెంట్ వేరు 
  • విడుదలైన తరువాత ఈ విషయం తెలుస్తుంది

అల్లు శిరీష్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ 'ఒక్క క్షణం' సినిమా చేశాడు. విభిన్నమైన కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గతంలో వచ్చిన కొరియన్ సినిమా 'ప్యారలల్ లైఫ్'ను స్ఫూర్తిగా తీసుకుని చేశారనే ప్రచారం జరుగుతోంది.

 'ప్యారలల్ లైఫ్' రీమేక్ హక్కులను తీసుకున్న నిర్మాత అనిల్ సుంకర, '2 మేమిద్దరం' సినిమాను నిర్మిస్తున్నాడు. 'ఒక్క క్షణం' అదే కాన్సెప్ట్ తో వస్తుండటంతో, ఆయన ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసినట్టుగా గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ స్పందిస్తూ ..  కొరియన్ సినిమా 'ప్యారలల్ లైఫ్' తాను చూశానని, కంటెంట్ పరంగా ఆ సినిమాకి .. తమ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తమ సినిమా విడుదలైన తరువాత ఈ విషయం తెలుస్తుందని స్పష్టం చేశాడు.      

More Telugu News