BJP: కౌంటింగ్ పై తాజా అధికారిక ప్రకటన వెలువరించిన ఎలక్షన్ కమిషన్!

  • స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ
  • ఈసీ ప్రెస్ రిలీజ్ ప్రకారం 97 చోట్ల బీజేపీ, 64 చోట్ల కాంగ్రెస్
  • నోటాకు 1.9 శాతం ఓట్లు

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతోంది. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన తాజా అధికారిక ప్రకటన ప్రకారం, ఇప్పటివరకూ ఏ ఒక్క స్థానంలోనూ తుది ఫలితం వెల్లడి కాలేదు. ఓట్ల లెక్కింపు అన్ని నియోజకవర్గాల్లో మొదలైంది. 97 చోట్ల బీజేపీ, 64 చోట్ల కాంగ్రెస్, ఒక్క చోట ఎన్సీపీ, 2 చోట్ల బీటీపీ (భారతీయ ట్రైబల్ పార్టీ), 3 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో బీజేపీకి 48.5 శాతం, కాంగ్రెస్ కు 42.5 శాతం ఓట్లు వచ్చాయి. 1.9 శాతం ఓటర్లు 'నోటా'ను ఎంచుకోవడం గమనార్హం.

More Telugu News