vizag oneday: విశాఖ వన్డే.. ఆదిలోనే శ్రీలంకకు ఎదురుదెబ్బ

  • 13 పరుగుల వద్ద గుణతిలక ఔట్
  • పెవిలియన్ చేర్చిన బుమ్రా
  • తొలి బంతినే బౌండరీకి తరలించిన సమరవిక్రమ

విశాఖపట్నంలో జరుగుతున్న చివరి వన్డేలో శ్రీలంక ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించిన ఓపెనర్ గుణతిలక 13 పరుగుల (12 బంతులు, 2 ఫోర్లు) వద్ద ఔట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఎండ్ లో ఉన్న తరంగ 2 పరుగులు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సమరవిక్రమ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు ఒక వికెట్ నష్టానికి 45 పరుగులు. భారత బౌలింగ్ ను భువనేశ్వర్ కుమార్, బుమ్రాలు ఆరంభించారు. 

More Telugu News