prem prakash tiwari: బీజేపీ నేత ప్రకాశ్ కుమారుడిని కాల్చి చంపిన దుండగులు!

  • అసెంబ్లీకి సమీపంలో ఉన్న నివాసంలో హత్య
  • వ్యాపార భాగస్వామిపై కేసు నమోదు
  • ప్రేమ వివాహం చేసుకున్న వైభవ్

ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ ప్రకాశ్ తివారీ కుమారుడు వైభవ్ తివారీ (39) దారుణ హత్యకు గురయ్యారు. లక్నోలోని యూపీ అసెంబ్లీకి సమీపంలో ఉన్న కస్మాండ్ హౌస్ లో నిన్న రాత్రి ఆయనను ఓ గుర్తు తెలియని దుండగుడు దారుణంగా కాల్చి చంపాడు.

పోలీసుల కథనం ప్రకారం... ఐఐఎం అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వైభవ్ వ్యాపారం ప్రారంభించారు. సూరజ్ అనే భాగస్వామితో కలసి బిజినెస్ చేశారు. కొంత కాలం తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో, ఇద్దరూ విడివిడిగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. అయితే సూరజ్ మాత్రం వైభవ్ పై పగతో రగిలిపోతూనే ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి వైభవ్ నివాసం ఉంటున్న కస్మాండా హౌస్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి, తుపాకితో వైభవ్ ను కాల్చి చంపాడు. సూరజే ఈ పనికి పాల్పడినట్టు ఇంట్లోని పనివాళ్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, సూరజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రేమ్ ప్రకాశ్ తివారీ 1989, 1991, 1993లలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీలోకి వచ్చారు. వైభవ్ తివారీ ప్రేమ వివాహం చేసుకున్నారు.

More Telugu News