rakul preet singh: నెల్లూరులో ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. భారీగా త‌ర‌లివ‌చ్చిన అభిమానులు.. సెల్ఫీ తీసుకున్న సుంద‌రి!

  • నెల్లూరులో ర‌కుల్‌ సందడి
  • మద్రాస్ బస్టాండ్ సెంటర్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం
  • అభిమానుల‌తో స‌ర‌దాగా ముచ్చ‌ట

టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా ఉన్న‌ రకుల్ ప్రీత్ సింగ్ నెల్లూరులో సందడి చేసింది. అక్కడ ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాన‌ని తెలుపుతూ  త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో ఓ సెల్ఫీ పోస్ట్ చేసింది. ఈ రోజు ఆమె నెల్లూరులోని మద్రాస్ బస్టాండ్ సెంటర్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించింది. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఈ సందర్భంగా అభిమానుల‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించింది. 'థ్యాంక్యూ నెల్లూరు.. చాలా ప్రేమ‌ను చూపించారు' అని అమ్మ‌డు పేర్కొంది. చీర కట్టులో ఆమె క‌న‌ప‌డిన తీరు అంద‌రినీ అల‌రించింది. అభిమానుల‌తో సెల్ఫీలు తీసుకుంది.       

More Telugu News