railway: రైల్వే మంత్రికి ఏపీ సీఎం చంద్ర‌బాబు లేఖ

  •  కాకినాడ‌-పిఠాపురం రైల్వే విస్త‌ర‌ణ ప‌నులను జరిపించాలి
  •  కాకినాడ‌- విశాఖ ప‌ట్నం మ‌ధ్య కూడా ఉప‌యోగం ఉంటుంది
  •  రైల్వే లైన్ విస్త‌ర‌ణతో పోర్టు క‌నెక్టివిటీకి మార్గం సుగ‌మం

రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు ఓ లేఖ రాశారు. కాకినాడ‌-పిఠాపురం రైల్వే విస్త‌ర‌ణ ప‌నులను జరిపించాల‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. రైల్వే లైన్ విస్త‌ర‌ణ వ‌ల్ల కాకినాడ‌- విశాఖ ప‌ట్నం మ‌ధ్య ఉప‌యోగం ఉంటుందని వివ‌రించారు. రైల్వే లైన్ విస్త‌ర‌ణతో పోర్టు క‌నెక్టివిటీకి మార్గం సుగ‌మం అవుతుందని చెప్పారు. కాకినాడ-పిఠాపురం కొత్త రైల్వే లైను నిర్మాణాన్ని నిలిపివేయాలని ఇటీవ‌ల‌ రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ లైను ఆర్థికంగా లాభదాయకం కాదని రైల్వే బోర్డు భావిస్తుండ‌డంతో ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.      

More Telugu News