vishnu: 'ఆచారి అమెరికా యాత్ర' ఎక్కడివరకూ వచ్చిందంటే ..!

  • విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'
  • ఈ నెల 21 నుంచి హైదరాబాద్ లో చివరి షెడ్యూల్
  • జనవరి 26న ప్రేక్షకుల ముందుకు    

మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా తెరకెక్కుతోంది. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే అమెరికాకు సంబంధించిన షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు.

 ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, బ్రహ్మానందం కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. 'అదుర్స్' సినిమాలో బ్రహ్మానందం చేసిన పాత్రను ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. ఆ తరహా పాత్రలోనే ఆయన సందడి చేయనున్నాడని అంటున్నారు. జనవరి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం. పూర్తి వినోదభరితంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా విష్ణుకు హిట్ ఇస్తుందేమో చూడాలి.   

More Telugu News