nagachaitanya: 'సవ్యసాచి' సినిమాలో హీరోకి ప్రత్యేక శక్తులు!

  • సవ్యసాచి' సినిమా షూటింగులో చైతూ 
  • ప్రతినాయక పాత్రలో మాధవన్ 
  • ఇద్దరివీ బలమైన పాత్రలే 
  • నువ్వా .. నేనా అంటూ సాగే యుద్ధం

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. తమిళ స్టార్ హీరో మాధవన్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ ఇద్దరి పాత్రలను చాలా బలంగా చందూ మొండేటి తీర్చిదిద్దాడట.

 దాంతో ఈ రెండు పాత్రలు కూడా నువ్వా .. నేనా? అనే స్థాయిలో తలపడతాయట. ఈ సినిమాలో చైతూ పాత్రకి కొన్ని ప్రత్యేక శక్తులు వుంటాయన్నట్టుగా తెలుస్తోంది. అవి ఈ కథను ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తూ, సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమా తరువాత మారుతి దర్శకత్వంలో చైతూ 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.         

More Telugu News