balakrishna: దుబాయ్ లో బాలకృష్ణ .. నయన్ ల సందడి

  • టాకీపార్టు పూర్తి చేసుకున్న 'జై సింహా'
  • కొనసాగుతోన్న పాటల చిత్రీకరణ 
  • జనవరి 12న ప్రేక్షకుల ముందుకు  

బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో 'జై సింహా' సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే టాకీ పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, పాటల చిత్రీకరణలో వుంది. ప్రస్తుతం ఒక పాటను దుబాయ్ లో చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ .. నయనతారల కాంబినేషన్లో అందమైన లొకేషన్లలో ఒక యుగళగీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని పాటల్లో ఇది హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నయనతారతో పాటు నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళంలో భారీ హిట్స్ ఇచ్చిన కె.ఎస్.రవికుమార్, తెలుగులో మాత్రం ఇంతవరకూ సరైన హిట్ ఇవ్వలేకపోయాడు. ఈ సినిమా ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి.          

More Telugu News