pavan kalyan: 'అజ్ఞాతవాసి' ఆడియో వేడుక డేట్ ఖరారు.. పోస్టర్ విడుదల!

  • 'అజ్ఞాతవాసి'కి అనిరుధ్ సంగీతం 
  • ఈ నెల 19న ఆడియో ఫంక్షన్ 
  • వేదికగా హైదరాబాద్ - హైటెక్స్ 
  • ముఖ్య అతిథిగా చిరంజీవి    

పవన్ కల్యాణ్ 25వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అజ్ఞాతవాసి' సినిమా తెరకెక్కింది. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వదిలిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రిలీజ్ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 19వ తేదీన ఆడియో ఫంక్షన్ జరపనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.

ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ గిటార్ ప్లే చేస్తున్నట్టుగా వున్న ఈ స్టిల్ ఆయన అభిమానులను ఆకట్టుకునేలా వుంది. ఈ ఆడియో ఫంక్షన్ కి హైదరాబాద్ - హైటెక్స్ వేదికగా మారబోతున్నట్టు సమాచారం. ఇక ఈ ఫంక్షన్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానుండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. మెగా బ్రదర్స్ ను ఒకే వేదికపై చూసే క్షణాల కోసం అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. జనవరి 10వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.    

More Telugu News