apcc: ఏపీసీసీ కార్యాలయంలో సంజయ్ గాంధీ జయంతి వేడుక

  • ఈ రోజు సంజ‌య్ గాంధీ జయంతి
  • సంజ‌య్‌గాంధీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఏపీసీసీ నేత‌ల నివాళి
  • విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యంలో కార్య‌క్ర‌మం

నెహ్రూ-గాంధీల కుటుంబ స‌భ్యుడు సంజ‌య్ గాంధీ జ‌యంతిని ఈ రోజు విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ రాష్ట్ర కార్యాల‌యంలో నిర్వ‌హించుకున్న‌ట్లు ఆ పార్టీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. సంజ‌య్‌ గాంధీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఏపీసీసీ నేత‌లు నివాళులు అర్పించారు. అనంత‌రం చిన్నారుల‌కు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీసీసీ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి మీసాల రాజేశ్వ‌ర‌రావు, అధికార ప్ర‌తినిధి వి.గురునాథం, కార్య‌ద‌ర్శి అన్వ‌ర్ హుస్సేన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.      

More Telugu News