Chandrababu: ఆ ఘనత చంద్రబాబుదే... తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు!

  • హైటెక్ సిటీలో టెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవం
  • ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్ ను నిలిపారు
  • మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీలు న‌గ‌రానికి రావడం చంద్ర‌బాబు ఘ‌న‌తే
  • అమరావతి భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుంది-కేటీఆర్‌

ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ను నిలపడంలో అప్ప‌ట్లో చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశార‌ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీలు న‌గ‌రానికి రావడంలో త‌న‌ కృషి ఏమీ లేదని, ఆ ఘ‌న‌త‌ అంతా చంద్రబాబు నాయుడిదేన‌ని చెప్పారు.

ఈ రోజు న‌గ‌రంలోని హైటెక్ సిటీలో జరిగిన టెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవానికి హాజ‌రైన కేటీఆర్ మాట్లాడుతూ... రానున్న రోజుల్లో హైదరాబాద్‌ నగర అభివృద్ధి కోసం వేస్తోన్న‌ ప్రణాళికలు, ఐటీ మౌలిక సదుపాయాల కల్పన గురించి తెలిపారు. 17 ఏళ్లలో న‌గ‌రానికి ప్రపంచ దిగ్గజ సంస్థలు వ‌చ్చాయ‌ని, ఏపీ రాజధాని అమరావతి భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందని అన్నారు.

More Telugu News