Aishwarya Rai: త్వ‌ర‌లో క‌లిసి న‌టించ‌నున్న ఐశ్వ‌ర్య‌, అభిషేక్‌?

  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న అభిషేక్ వ‌ర్మ‌న్‌
  • నిర్మాత‌లుగా క‌ర‌ణ్ జొహార్‌, సాజిద్ న‌డియాడ్‌వాలా
  • ఇప్పటివ‌ర‌కు ఎనిమిది సినిమాల్లో క‌లిసి న‌టించిన ఐష్, అభి

బాలీవుడ్ ఫేవ‌రెట్ దంప‌తులు అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్య‌రాయ్‌లు క‌లిసి త్వ‌ర‌లో ఓ చిత్రంలో న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. 2 స్టేట్స్ చిత్ర ద‌ర్శ‌కుడు అభిషేక్ వ‌ర్మ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా నిర్మాత‌లుగా క‌ర‌ణ్ జొహార్, సాజిద్ న‌డియాడ్‌వాలాలు వ్య‌వ‌హరించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అయితే మొద‌ట్లో ఈ సినిమా చేయ‌డానికి ఐష్‌, అభిలు స‌సేమిరా అన్నార‌ట‌, కానీ క‌ర‌ణ్ జొహార్ తీవ్రంగా ప్ర‌య‌త్నించడంతో చివ‌రికి సినిమా చేసేందుకు ఒప్పుకున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.

అయితే, ఈ సినిమా కథా‌క‌థ‌నాల గురించి కానీ, షూటింగ్ షెడ్యూల్స్ గురించి కానీ ఇంకా ఏమీ వెల్లడికాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప‌నులు ‌వేగంగా జరుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఐశ్వ‌ర్య‌, అభిషేక్‌లు క‌లిసి కుచ్ న క‌హో, గురు, బంటీ ఔర్ బ‌బ్లీ, ఉమ్రావ్ జాన్‌, ధూమ్ 2, ఢాయి అక్ష‌ర్ ప్రేమ్ కీ, రావ‌ణ్‌, స‌ర్కార్ రాజ్ చిత్రాల్లో న‌టించారు.

More Telugu News