prapancha telugu maha sabhalu: తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్ కు అవమానం: రావుల

  • ఎన్టీఆర్ పేరును విస్మరించారు
  • సభల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది
  • పోస్టర్లలో ఆంగ్ల భాషను వాడారు

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తీరుపై టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిష్టాత్మకమైన ఈ సభల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. అందరినీ కలుపుకుని ఈ వేడుకలు జరిపితే బాగుండేదని అన్నారు.

మహా సభల సందర్భంగా కొందరు మహనీయులను విస్మరిస్తున్నారని... ఎన్టీఆర్ పేరును కూడా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎన్టీఆర్ ను అవమానించడమేనని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లలో ఇంగ్లీష్ భాషను వాడారంటూ మండిపడ్డారు. ఖాళీగా ఉన్న తెలుగు భాషా పండితుల నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.

More Telugu News