charan: 'రంగస్థలం' చూసిన చిరంజీవి ఇలా అన్నారట!

  • 'రంగస్థలం' చూసిన చిరంజీవి 
  • సుకుమార్ కి సూచనలు 
  • మార్చి 30వ తేదీన రిలీజ్      

సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న 'రంగస్థలం' సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంతవరకూ షూట్ చేసిన దానిని చిరంజీవి చూశారట. 1985 కాలానికి సంబంధించిన కథా నేపథ్యంలో .. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హీరోగా చరణ్ .. హీరోయిన్ గా సమంత గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతీ యువకులుగా కనిపించనున్నారు.

ఈ కారణంగా సినిమాలో డీ గ్లామర్ అంశాలు ఎక్కువగా వున్నాయని చిరంజీవి అభిప్రాయపడ్డారట. డీ గ్లామర్ అంశాలను తగ్గించమని సుకుమార్ కి సూచించారని సమాచారం. చిరంజీవి సూచనల మేరకు సుకుమార్ కొన్ని సీన్స్ ను రీ షూట్ చేసే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. ఇక ఈ సినిమా కథ గతంలో తాను చేసిన 'ఊరికిచ్చిన మాట' ఛాయల్లో ఉండటాన్ని కూడా చిరంజీవి గమనించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మార్చి 30వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. 

More Telugu News