gujarat: గాంధీన‌గ‌ర్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న మోదీ త‌ల్లి

  • చిన్న కుమారుడు పంక‌జ్ మోదీతో క‌లిసి వ‌చ్చిన హీరాబా మోదీ
  • 'గుజ‌రాత్‌కి మంచి జ‌ర‌గాలి' అని వ్యాఖ్య‌
  • ప్ర‌శాంతంగా జ‌రుగుతున్న రెండో విడ‌త‌ పోలింగ్

గుజ‌రాత్‌లోని 93 సీట్ల‌కు జ‌రుగుతున్న రెండో విడ‌త పోలింగ్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ త‌ల్లి హీరాబా మోదీ త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. చిన్న కుమారుడు పంక‌జ్ మోదీ, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి గాంధీన‌గ‌ర్‌లోని ఆర్య‌భ‌ట్ట హై స్కూల్ పోలింగ్ కేంద్రానికి ఆమె హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం 90 ఏళ్ల‌కి పైగా వ‌య‌సున్న హీరాబా మోదీ ఓటు వేసిన త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చి, తాను ఓటు వేసినట్లుగా సిరా గుర్తును మీడియాకు చూపించారు.

'గుజ‌రాత్‌కి మంచి జ‌ర‌గాలి' అని హీరాబా మోదీ వ్యాఖ్యానించారు. ఉత్త‌ర, మ‌ధ్య గుజ‌రాత్ ప్రాంతాల్లో జ‌రుగుతున్న ఈ పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రుగుతోంద‌ని అధికారులు చెబుతున్నారు. దాదాపు 2.22 కోట్ల మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.  

More Telugu News